సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎం.ఎల్.ఎ నాయకర్

నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు & చెక్కు వివరాలు: సుందర రామకృష్ణ (నిటితిప్ప గ్రామం) – ₹ 1,75,895, లక్కు నాగలక్ష్మి (రామన్నపాలెం – లక్కు వారి తోట) – ₹ 20,000, గొల్లమందల చరిత (కొప్పరు గ్రామం) – ₹ 30,786. ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, ఈ నిధులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఎంతో ఉపయోగపడతాయని, కష్టకాలంలో ప్రభుత్వం ప్రజలతో పాటు నిలబడి సహాయం అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపికృష్ణ, బందేల రవీంద్ర, గుబ్బల మారాజు, బందేలా ఎలేష
కటకం శెట్టి సంజీవరావు, పోలిశెట్టి గణేశ్వర రావు, వడ్డి ఆదినారాయణ, ఇది కాకుండా నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment