నరసాపురం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సందర్బంగా నరసాపురం నియోజకవర్గం ముత్యాలపల్లిలో శ్రీశ్రీశ్రీ బండి ముత్యాలమ్మ అమ్మ వారిని, కాళీపట్నం వెస్ట్, లక్ష్మణేశ్వరం, నరసాపురం పట్టణంలో బస్టాండ్ దగ్గర కనకదుర్గమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ శ్రీమతి సునీత దంపతులు. ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలను నరసాపురం నియోజకవర్గ ప్రజలకు జనసేన టిడిపి బిజెపి నాయకులకు, శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు, అధికారులకు తెలుపుతూ అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన-టిడిపి-బిజెపి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment