గుబ్బల మాణిక్యాలరావుని పరామర్శించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్

నరసాపురం, మొగల్తూరు నల్ల వారి తోటలో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన గుబ్బల మాణిక్యాలరావుని భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్‌ బుధవారం పరామర్శించారు. గాయాల తీవ్రతను వివరంగా అడిగి తెలుసుకున్న ఆయన, మాణిక్యాలరావు కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి, బాధితుడి చికిత్స కోసం తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేగాక, ఆయన ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, బాధితుడికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆదేశించారు.

Share this content:

Post Comment