ఏలూరు జిల్లా, టి. నరసాపురం మండలం, మద్యనపువారిగూడెం గ్రామంలో కొలువైయున్న శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించి, అమ్మవారి దీవెనలు పొందారు, అనంతరం తిరుమల దేవి పేటలో శ్రీరామాలయంలో సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత స్వామి వారిని దర్శించి, మండల ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమణుగు రవి, జనసేన మండల్ ప్రెసిడెంట్ అడపా నాగరాజు, టిడిపి ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్, ఎన్.డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:
Post Comment