డా.బి.ఆర్.అంబేడ్కర్ 134వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలలో రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. మలికిపురం ఫూలే – అంబేద్కర్ భవనం నందు జరిగిన జయంతి వేడుకలలో పాల్గొన్నారు అనంతరం భూపతివారి పేట నందు జరిగిన జయంతి ఉత్సవాలలో పాల్గొని ఆ మహనీయునికి నివాళులర్పించారు. ఆ తదుపరి సఖినేటిపల్లి మూడు తూములు వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అంతర్వేది దేవస్థానం మరియు అంతర్వేదికర లో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. చింతలమోరి – పోడుతోట లో కేక్ కట్ చేసి అంబేద్కర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలియచేశారు. కేశనపల్లి గ్రామంలో జయంతి ఉత్సవాలలో పాల్గొని ఆ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల బహుమతులు అందించారు. గొల్లపాలెం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నూతన విగ్రహాన్ని శాసనసభ్యుల వారు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ చక్కటి ఉత్సాహ వాతావరణంలో ఈ కార్యక్రమం జరగడం సంతోష్ దాయకమని అన్నారు ఇక్కడ యువత అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు అని తెలిపారు. యువత ఉండాలని చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దని ఉన్నత లక్ష్యాలు వైపు పయనించాలని సూచించారు. తదుపరి దిండి గ్రామ అంబేద్కర్ జయంతి ఉత్సవ వేడుకల్లో పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి నాయకులు, అంబేద్కర్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Share this content:

Post Comment