సిసి రోడ్ల నిర్మాణ పనులపై ఎమ్మెల్యే గిడ్డి సమీక్ష

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని ఉడుముడి లంక, పెదపూడి లంక, అరీగెలవారిలంక, భూరులంక గ్రామాల్లో సుమారు రూ.4.30 కోట్ల వ్యయంతో నిర్మించబడుతున్న సిసి రోడ్ల పనులను శుక్రవారం పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, నాణ్యతలో ఎలాంటి క్షీణత లేకుండా, పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తన సొంత గ్రామమైన ఉడుముడి లంకలో ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని వారి సమస్యలు స్వయంగా విన్న ఎమ్మెల్యే, త్వరితగతిన పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాలుగు లంకల పర్యటనలో ప్రజల్లో అభివృద్ధిపట్ల విశ్వాసం పెంపొందించేలా ఎమ్మెల్యే సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment