విళ్ళ సుబ్బారావు కుటుంబానికి ఎమ్మెల్యే గిడ్డి పరామర్శ

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, లుటుకుర్రు బాడిలంకకు చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు విళ్ళ సుబ్బారావు మాతృవియోగంతో బాధపడుతుండగా, పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ వారి నివాసానికి వెళ్లి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన, సుబ్బారావుకి ధైర్యం తెలియజేస్తూ, తల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆధ్యాత్మిక శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment