నరసాపురం పట్టణంలోని 1వ వార్డు శ్రీహరిపేట, మొగల్తూరు మరియు సీతారాంపురంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థల (ఈ. డబ్ల్యు.ఎస్) సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ (టైలరింగ్) కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్. ఈ శిక్షణ ద్వారా మహిళలకు స్వావలంబన సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడ్డ మహిళలకు ఈ శిక్షణ ఉపయుక్తంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల సద్వినియోగంతో మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని ఎమ్మెల్యే నాయకర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, బందెల రవీంద్ర, పిల్లా శ్రీహరి, ఇంటి మురళి, వట్టిప్రోలు సతీష్, కుసుమ కిరణ్ , గన్నాబత్తుల దుర్గాప్రసాద్, అధికారులు, జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, జనసైనికులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment