ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ నేతృత్వంలో నిర్వహించారు. “చలో అమరావతి” కార్యక్రమంలో భాగంగా, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, సమర్థకులు బస్సులు, కార్ల ద్వారా భారీ సంఖ్యలో అమరావతికి చేరుకున్నారు. మొగల్తూరు మండలం బండి ముత్యాలమ్మ గుడి వద్ద నుంచి బొమ్మిడి నాయకర్ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, బీజేపీ ఇంచార్జ్ మేకల సతీష్, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు, జనసేన, టిడిపి, బిజెపి కార్యకర్తలు, నాయకులు, మహిళా శక్తి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజధాని అమరావతి పునఃప్రారంభానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, అభివృద్ధి పునఃప్రారంభానికి మద్దతు తెలిపారు.
Share this content:
Post Comment