శ్రీశ్రీశ్రీ జగదాంబ అమ్మవారి 68వ వార్షికోత్సవ తిరునాళ్ల సందర్భంగా ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండల కేంద్రంలో కొలువై ఉన్న అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసి, దర్శించుకుని, తిరునాళ్లు ప్రారంభించిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. అనంతరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మొన్నటి వరకు ఒక్క శాసనసభ్యులు లేరు. నేడు నేను శాసనసభ్యులుగా ఉన్నానంటే అమ్మవారి కృపయే అని నేను బలంగా నమ్ముతున్నాను. అమ్మవారి 68వ వార్షికోత్సవ తిరుణాలు, మునుపెన్నడు లేనివిధంగా, సుమారు పాతికమంది కమిటీ సభ్యులను నియమించి, అంగరంగ వైభవంగా చేయడానికి, మా వంతు సహాయంతో, దాతలు సాకారంతో, అమ్మవారి దయతో ముందుకు వెళ్తున్నాము. కొన్ని మెడికల్ క్యాంప్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అసాంఘిక కార్యక్రమలు, అవాంఛనీయ సంఘటనలు, అపశృతులు జరగకుండా ఈ 6రోజులు పోలీసు డిపార్ట్మెంట్ వారు పర్యవేక్షణలో ఉంటుంది. నేను కూడా ప్రతి గంట గంటకు పరిస్థితులు గురించి ఆరా తీస్తుంటాను. కావున భక్తులందరూ కుటుంబ సభ్యులతో వచ్చి, అమ్మవారిని దర్శించుకుని, సకల ఐశ్వర్యం, ఆరోగ్యలతో ఉండాలని,యావత్ మంది భక్తులకు స్వాగతం పలుకుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమనుగు రవి, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, సుంకువల్లి సాయి, గుడ్ల రాంబాబు, ఆలయ కమిటీ చైర్మన్ చిర్రి వెంకటేశ్వరావు, కమిటీ సభ్యులు, ఎన్.డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment