ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలి

  • ఎమ్మెల్యే నాయకర్, పొత్తూరి.

నరసాపురం, ఉభయ గోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి, పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ప్రభుత్వ విప్ మరియు నరసాపురం నియోజకవర్గ శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నరసాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొత్తూరి రామరాజు నియోజకవర్గ అబ్జర్వర్ సూర్యనారాయణ రాజు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సోమవారం మొగల్తూరు మండలంలోని నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కెపిపాలెం సౌత్ మరియు నార్త్ పేరుపాలెం సౌత్ మరియు నార్త్ ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్స్ ని కలిసి, కరపత్రాలను పంపిణీ చేసి, మీ 1.వ ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపికృష్ణ, గుబ్బల నాగరాజు అందే దొరబాబు వెంకటలక్ష్మి, గుబ్బల మారాజు, ఉప్పులూరు రాంబాబు, అందే జగదీష్, అందే శివ, తాతాజీ, సత్యనారాయణ మరియు జనసేన-టిడిపి-బిజెపి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment