రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి విజయ భాస్కర్ ఆదేశాల మేరకు బుధవారం అడ్డతీగల పంచాయతీ పరిధిలో కూటమి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖరంని గెలిపించాలని ఒకటవ 1 నెంబర్ ప్రాధాన్యత ఓటు వెయ్యాలని కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల శ్రీనివాస్, అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment