కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి, పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని కోరుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ విప్ మరియు నర్సాపురం నియోజకవర్గ శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నర్సాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొత్తూరి రామరాజు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం నరసాపురం నియోజకవర్గం నర్సాపురం మండలంలోని సరిపల్లి, మల్లవరం, మల్లవరం లంక, లిఖితపూడి, కొప్పర్రు, బేతపూడిలో పలుచోట్ల ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్స్ ని కలిసి, కరపత్రాలను పంపిణీ చేసి, మీ 1.వ ప్రాధాన్యత ఓటు పేరా బత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ అబ్జర్వర్ సూర్యనారాయణ రాజు, జనసేన టిడిపి మండల అధ్యక్షులు ఆకన చంద్రశేఖర్, వాతడి ఉమా, పోలిశెట్టి శ్రీనివాస్, అందే నరేన్, కుసుమ కిరణ్ జనసేన టిడిపి బిజెపి నాయకులు జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment