నరసాపురంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

నరసాపురం, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి, పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆదివారం ప్రభుత్వ విప్ మరియు నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సలహాదారులు, మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ , జిల్లా జనసేన పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ చెనమల్ల చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నరసాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొత్తూరి రామరాజు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆదివారం నరసాపురం నియోజకవర్గంలోని నరసాపురం పట్టణంలో 18, 19, 23వ వార్డులలో పలుచోట్ల ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్స్ ని కలిసి, కరపత్రాలను పంపిణీ చేసి, మీ 1వ ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన-టిడిపి పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, జక్కం శ్రీమన్నారాయణ, వలవల నాని , శంకు భాస్కర్ నాయుడు, పోలిశెట్టి నళిని, దొండపటి స్వాములు, మల్లాడి మూర్తి, చక్రవర్తి, గ్రంధి నాని, దేవరపు సుబ్బారావు, అడ్డాల శ్రీను మరియు జనసేన-టిడిపి-బిజెపి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment