నరసాపురం, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ప్రభుత్వ విప్ మరియు నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నరసాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, మాజీ మంత్రివర్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంగళవారం నరసాపురం మండలంలోని ఎల్బీ చర్ల, చామకూరిపాలెం, తూర్పు తాళ్ళు, పసలదీవి పలుచోట్లలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్స్ ని కలిసి, కరపత్రాలను పంపిణీ చేసి, మీ 1.వ ప్రాధాన్యత ఓటు పేరా బత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం మండల జనసేన టిడిపి అధ్యక్షులు ఆకన చంద్రశేఖర్, వాతాడి ఉమా, గుబ్బల మారాజు, బందెల రవీంద్ర, కటకంశెట్టి సంజీవరావు, కంచర్ల ఫణి, బల్ల హనుమంతు, పులపర్తి రాంబాబు, గుత్తుల సాయి, గోల్డ్ రాజు, గన్నాబత్తుల దుర్గా ప్రసాద్, పార్థసారధి బైనపాలెం, అందే రామకృష్ణ, జనసేన-టిడిపి-బిజెపి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment