రాయిగూడెంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

వి.ఆర్.పురం మండలం, జీడిగుప్ప పంచాయతీ, రాయిగూడెం గ్రామంలో ఎమ్మెల్సీ ఓటర్ క్యాంపియన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన పట్టభద్రుల ఎం.ఎల్.సి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంని పరిచయం చేస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, మెగా డిఎస్సి, ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షన్స్ ఇంకా మన ప్రభుత్వం చేపట్టిన మరియు చేపట్టబోతున్న అన్ని పధకాల గురించి వివరిస్తూ తమ ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ లో రాజశేఖరం గారి పేరు ఎదురుగా 1 అంకెను మాత్రమే వేయమని ప్రతి ఓటర్ కి అవగాహన కల్పించడం జరిగింది. జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల కార్యదర్శి బాగుల అంజనరావు, ములకాల కిషోర్ కుమార్, యూత్ నాయకులు ముంజపు సాయిరాం, మామిళ్ళ వంశీ, సీనియర్ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాస్, మండల సహాయ కార్యదర్శి ముంజపు శ్రీరామ్, ముత్యాల అప్పన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment