మానవత్వం చాటిన మోటూరి దంపతులు

అంబేద్కర్ కోనసీమజిల్లా, అమలాపురం, కలెక్టర్ కార్యాలయంలో వయోవృద్ధుల వికలాంగుల సంక్షేమ అధికారులు దివ్యాంగులకు శాంక్షన్ అయిన మూడు చక్రాల వాహనములు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో లోపం వల్ల ఆలస్యం అయింది. ఇంతలో ఎండలో వాళ్ళు ఇంటికి వెళ్లలేక మళ్లీ అక్కడికి రాలేక ఆకలితో అలమటిస్తూ అక్కడే ఉండిపోయారు. ఈ విషయం దివ్యాంగ నాయకుల ద్వారా తెలుసుకొని చిందాడగరువు ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు ధన సహాయంతో డిఆర్ఓ సమక్షంలో 60 మంది దివ్యాంగులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ అధికారులు, దివ్యాంగ నాయకులు బొంతు శ్రీను, కాశి వెంకటరమణ, పలివెల రాజు, కాకర రాజేశ్వరి, ముమ్మిడివరపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.