యువశక్తికి తరలిరండి: త్యాడ రామకృష్ణారావు

  • గురాన అయ్యలు ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం

విజయనగరం: రణస్థలంలో జనవరి 12, గురువారం,జరగనున్న యువశక్తి కార్యక్రమానికి తరలి రావాలని, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనీయర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) పిలుపునిచ్చారు.బుధవారం నాడు కామాక్షి నగర్, కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో జనశక్తి గోడ పత్రికలను అంటించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ జనసేన నాయకులు గురాన అయ్యలు ఆధ్వర్యంలో గత పదిరోజులనుండి యువశక్తి కార్యక్రమానికి విజయనగరం నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం చేపట్టామని,కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులతో సమావేశాలు,నియోజకవర్గం అంతటా కరపత్రాలు,గోడ పత్రికలను అంటించి ప్రచారం చేపట్టామని తెలిపారు. యువతీ యువకుల బంగారు భవిష్యత్ కోసం పవన్ కళ్యాణ్ తన బంగారు జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు పవన్ కళ్యాణ్ అని, యువత జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో పెడుతున్న యువశక్తి కి అందరూ విచ్చేసి సభను విజయవంతం చేయాలని కోరారు.