పార్వతీపురంలో ఎంపీ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీత ర్యాలీ

పార్వతీపురం, జనసేన-బిజెపి-టీడీపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీతకి పార్వతీపురం జనసేన పార్టీ సమన్వయకర్త ఆదాడ మోహన్ రావు మెడలో జనసేన పార్టీ కండువా మెడలో వేసి మర్యాదపూర్వకంగా నియోజకవర్గానికి ఆహ్వానించి ర్యాలీలో జనసేన-బిజెపి-టిడిపి కూటమి ఉద్దేశించి ఆదాడ మోహన్ రావు మాట్లాడడం జరిగింది. జనసేన-బిజెపి-టిడిపి ఉమ్మడి అభ్యర్థిని కలవ పువ్వు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి పార్లమెంటుకు పంపించవలసిన బాధ్యత పార్వతీపురం జనసైనికులు మీద, టిడిపి కార్యకర్తల మీద, బిజెపి కార్యకర్తల మీద మూడు పార్టీల నాయకులు మీద ఉందని అలాగే టిడిపి అభ్యర్థి విజయచంద్ ని కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క టిడిపి జనసేన బిజెపి నాయకుడు కార్యకర్త ఉమ్మడి అభ్యర్థి గెలుపు లక్ష్యంగా పనిచేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జనసేన నాయకులు చందక అనిల్, పార్వతీపురం జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆగూరు మణి, సీతానగరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు పాటి శ్రీనివాసరావు, బలిజిపేట జనసేన పార్టీ మండల అధ్యక్షులు బంకురు పోలి నాయుడు మూడు పార్టీలకు చెందిన మండల గ్రామ రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొనడం జరిగింది.