ఎంపీపీ సత్యవాణికి అస్వస్థత.. పరామర్శించిన శంకర్ గౌడ్

*అస్వస్థతకు గురైన ఎంపీపీ సత్యవాణి.. కిమ్స్ ఆస్పత్రిలో చేరిక

*సత్యవాణి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న శంకర్ గౌడ్

*సత్యవాణి ఆరోగ్యం బాగుపడాలి అని రాష్టంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు

హైదరాబాద్: మలికిపురం జనసేన ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి మండల పరిషత్ కార్యాలయంలో మండల మీటింగ్ లో మాట్లాడుతూ అకస్మాత్తుగా అస్వస్థతకు గురైయ్యారు. రాజోలు మరియు రాజమండ్రి హాస్పిటల్ కి తీసుకుని వెళ్లగా అక్కడ ఉన్న హాస్పిటల్ సిబంది వాణి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కిమ్స్ కి తీసుకుని వెళ్ళమని సూచించారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించడం జరిగింది. శనివారం అన్ని పరీక్షలు జరిపి.. ఆదివారం ఉదయం ఆపరేషన్ చేయనున్నారు. విషయం తెలుసుకొన్న తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్, జనసేన తెలంగాణ వీరమహిళా విభాగం చైర్మన్ కావ్య ముదిరాజ్, వైస్ చైర్మన్ రత్న పిల్ల, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అరుణ, సుజాత, వెంకట్ లక్ష్మి హాస్పిటల్ కి వచ్చి సత్యవాణి ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వీర మహిళా విభాగం నుండి కూడా ఒక బృందం కిమ్స్ కి రావడం జరిగింది. రాజోలు నుండి కూడా నాయకులు హాస్పిటల్ కి వెళ్ళి హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నారు. సత్యవాణి ఆరోగ్యం బాగుపడాలి అని రాష్టంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.