విశాఖ ఉక్కు ఉద్యమానికి ఎమ్మార్పిఎస్‌ మద్దతు

విశాఖ ఉక్కు ఉద్యమానికి ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కఅష్ణ మాదిగ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ చేయడం బాధాకరమన్నారు. ప్రజలు, కార్మికులు, నిర్వాసితుల మనోభావాలు గౌరవించి స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం కట్టుబడి ఉండాలన్నారు. ఏపీకిచ్చిన విభజన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈ నెల 24న ఢిల్లీలో జాతీయ మహాసభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తమకు మద్దతిచ్చిన వారందరినీ సభకు ఆహ్వానిస్తున్నామని ఆయన వివరించారు.