కోరుకొండ మండలం, గాదరాడ గ్రామానికి చెందిన గూడుపు లక్ష్మి ఇటీవల పరమపదించారు. శనివారం జరిగిన పెదకార్యానికి జనసేన పార్టీ “నా సేన కోసం నా వంతు” స్టేట్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి హాజరై, నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శోకసంతప్త కుటుంబానికి ధైర్యం చెప్పిన ఆమె, పార్టీ తరపున సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment