దేవి నవరాత్రుల అన్నసంతర్పణలో పాల్గొన్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

  • సంతర్పణకు 3600 మినరల్ వాటర్ బాటిల్స్ అందజేత

రాజానగరం నియోజకవర్గం, సంపత్ నగర్, కనకదుర్గ అమ్మవారి గుడి వద్ద దేవి నవరాత్రులు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొనడం జరిగింది. సంతర్పణకు మూడు వేల ఆరువందల (3600) మినరల్ వాటర్ బాటిల్స్ ని సంతర్పణ కార్యక్రమానికి బత్తుల అందించారు. ఈ కార్యక్రమంలో సంపత్ నగర్ గ్రామ ఉప సర్పంచ్ నల్ల దుర్గా ప్రసాద్, తోనె మాణిక్యాలరావు, 7వ వార్డు మెంబర్ పెంటగట్ల రాంబాబు, 10వ వార్డు మెంబర్ దుర్గన పండు, ఎ. మణికంఠ, వై. సూరిబాబు, ఎ.‌శ్రీను తదితరులతో పాటు సంపత్ నగర్ గ్రామ ప్రజలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.