తంగెల్ల ముసలయ్యని పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి
రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామ ప్రెసిడెంట్ తంగెల్ల ముసలయ్య తల్లి ఇటీవల స్వర్గస్తులయ్యారు అని నరేంద్రపురం జనసైనికుల ద్వారా తెల్సుకున్న రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. వీరి వెంట జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ ప్రగడా నాథ్, వైస్ ప్రెసిడెంట్ గట్టి రాంబాబు, ఆమదాల అనిల్ కుమార్, ప్రగడా వీర్రాజు, చిట్టిప్రోలు సత్తిబాబు, పాటంశెట్టి సుబ్బారావు, కిమిడి శ్రీరామ్, తోకాడ రాజు, తోట అనిల్ వాసు, ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-20-at-11.59.20-1024x768.jpeg)