కర్రి అప్పారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం కోటి గ్రామానికి చెందిన కర్రి అప్పారావు సతీమణి కర్రి ఏలేశ్వరి ఇటీవల స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గురువారం ఏలేశ్వరి పెదకార్యం కార్యక్రమంలో పాల్గొని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట ఉల్లి సువర్ణకాపు, నందే సూరిబాబు, చదువు ముత్తయ్య, చదువు నాగు, నండూరి కృష్ణ, గట్టి శ్రీను, నండూరి దొరబాబు, దేవన కృష్ణ, దేవుళ్ళు, నరేష్, శివ, మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.