కోరుకొండలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలంలో పలు కుటుంబాలను శనివారం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. ముందుగా కోటి గ్రామంలో నండూరి వెంకటరామయ్య ఇటీవల స్వర్గస్తులయ్యారు అని తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పడం జరిగింది. అనంతరం కోటి గ్రామంలో వాడ పత్తి సత్తమ్మ ఇటీవల స్వర్గస్తులయ్యారు అని తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉల్లి సూరన్న కాపు, నండూరి సత్యనారాయణ, దేవన కృష్ణ, ఓరుగంటి గంగరాజు, నండూరి శ్రీరామచంద్రమూర్తి, నండూరి శివరామకృష్ణ, కడిమి పోసిబాబు, అడ్డాల దొరబాబు గారు, దేవన దుర్గ ప్రసాద్ (డిడి) మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.