మల్లంపూడి గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, మల్లంపూడి గ్రామంలో గురువారం పలు కుటుంబాలను జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలకరించారు. గ్రామానికి చెందిన పడాల దుర్గాప్రసాద్ ఇటీవల ప్రమాదవశాత్తు చేతికి గాయం అయిందని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బాసు వెంకటేష్ అనారోగ్యంతో బాధపడ్తున్నారని తెలిసి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వైద్యుల సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బత్తుల వెంకటలక్ష్మి తెలియజేసారు. వీరి వెంట సొంగుల శ్రీను, సొంగుల లక్ష్మణరావు, కలిదిండి మణికంఠ స్వామి, సొంగుల దుర్గాప్రసాద్, మేక ప్రదీప్, బాస్ పాపారావు, సొంగుల చిట్టి దొర, సొంగుల సతీష్ గారు, బోయిడి వెంకటేష్ గారు, ఈస్ట్ గాణుగూడెం ప్రెసిడెంట్ గల్లా రంగా, అడ్డాల దొరబాబు, తోట అనిల్ వాసు, వేగిశెట్టి రాజు మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.