నరేంద్రపురంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామంలో పలు కుటుంబాలను శనివారం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలకరించి, పరామర్శించారు. కార్యక్రమంలో ముందుగా ఇటీవల కారు ప్రమాదానికి గురై కాలికి గాయంతో హాస్పిటల్ పాలైన చింతల వెంకట్రావు కుమారుడు చింతల సత్తిబాబును పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై ఇంటికి పరిమితమైన నరేంద్రపురం గ్రామానికి చెందిన నక్క వీరస్వామి కుమారుడు నక్క వీర వెంకన్నని పలకరించి జరిగిన ప్రమాదం గురించి అడిగి తెలుసుకుని త్వరితగతిని కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం నరేంద్రపురం గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి రాము భార్య ఇటీవల అనారోగ్యం కారణంతో మరణించినారు. వారి కుటుంబానికి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కుటుంబ సభ్యులకు మనోధర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ప్రగడ బాబూరావు, చౌటుపల్లి అబ్దుల్, ఆదిమూలం లక్ష్మణరావు, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ప్రగడ నాగేశ్వరరావు, గ్రామ జనసేన వార్డు సభ్యుడు ఆముదాల అనిల్ కుమార్, కర్రీ శ్రీను, ప్రగడ రాంబాబు, ఆళ్ల అంజిబాబు, యెలుబండి రాము, ప్రగడ చిరంజీవి, శృగావరుపు శ్రీను, ఉల్లి నరేష్, బత్తిన అంజి, రాచపోతులు మణికంఠ, ప్రగడ సురేష్, చిట్టిప్రోలు సురేష్, ప్రగడ గోవిందరాజు, చౌటపిల్లి పెద్ద, చిట్టిప్రోలు సత్తిబాబు, యర్రంశెట్టి పోలరావు మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.