రాధేయపాలెంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామంలో పలు కుటుంబాలను శనివారం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. సామోజీ లక్ష్మణరావు ఇటీవల స్వర్గస్తులయ్యారు విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పారు. అనంతరం లంజిపల్లి అంజయ్య అనారోగ్యంతో బాధపడ్తున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడి దైర్యం చెప్పారు. అదేవిధంగా పెనిమిరెడ్డి గంగాధరరావు సతీమణి పెనిమిరెడ్డి సత్యవతి అనారోగ్యంతో బాధపడ్తున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడి దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ నాయకులు శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, కొప్పిరెడ్డి గోవింద్, దొడ్డా శ్రీను, పెదిరెడ్డి శ్రీను, తోట జానికయ్య, అరిబోలు సూరన్న, మద్దినాల రామకృష్ణ, కమిడి సత్తిబాబు, మోటుపల్లి మణికంఠ, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.