సీతారామపురలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల
రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, సీతారామపురం గ్రామంలో పలు కుటుంబాలను గురువారం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. ముందుగా అడబాల నారాయణ రావు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సూరపరెడ్డి సురేంద్రను ఇటీవల జరిగిన యాక్సిడెంట్లో గాయపడిన విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నక్క సత్తియ్య ఇటీవల జరిగిన యాక్సిడెంట్లో గాయపడిన విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన నాయకులు అడబాల అడివిష్ణు, వల్లభశెట్టి శంకర్, జాజుల ధర్మరాజు, అడబాల శ్రీను, పల్లపు గోవింద్, పల్లపు చక్రం, దాసరి పెంటయ్య, బి. పరుశుద్దమ్, అడబాల రాజు, అడబాల బాబీ, దేవన దుర్గ ప్రసాద్ (డిడి), మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-17-at-17.31.59-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-17-at-17.32.00-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-17-at-17.32.01-1024x768.jpeg)