దేవరపల్లిలో శ్రీమతి డొక్కా సీతమ్మ ఆహరినిధి కార్యక్రమం
మాడుగుల నియోజకవర్గం, దేవరపల్లి మండలంలో దేవరపల్లి బస్టాండ్ ఆవరణ వద్ద మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ ఆహార నిధి కార్యక్రమం అతి భారీగా జరుపబడింది. మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల నియోజకవర్గ నాయకులు రాయపురెడ్డి కృష్ణ మాట్లాడుతూ ఒక్కో వారం ఒక్కో మండలంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని ప్రతినెల మూడవ వారం ఈ యొక్క కార్యక్రమం దేవరపల్లి మండలంలో జరగుతుందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో దేవరపల్లి మండల జనసేన నాయకులు గుర్రపుట్టి రామ్మూర్తి నాయుడు కుమార హేమంత్ కుమార్ సూరిబాబు భాస్కరరావు శివ దుర్గారావు, కే కోటపాడు మండల నాయకులు కుంచా అంజిబాబు మరియు మాడుగుల నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-19-at-19.36.26-2.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-19-at-19.36.26-1.jpeg)