జనసేన అధినేత & ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, ప్రజాసేవా స్ఫూర్తితో నాటి జిల్లా జనసేన అధ్యక్షులు, నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభించబడిన శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం ద్వారా ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు ఉచిత అన్నపానీయ సేవలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా జనసేన కార్యదర్శి, సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు & జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు నేటికీ నిర్వహిస్తున్నారు. 139వ వారంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో శనివారం రైతులు, పశువుల బేరాల మధ్యవర్తులు, ఆసుపత్రులకు వచ్చిన ఔట్ పేషెంట్లు సహా 600 మందికి ఉచిత భోజనం, తాగునీరు అందజేశారు. ఈ వడ్డన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని భోజనం చేసిన వారిలో రైతులు సఖినాల లచ్చబాబు, కొలా నాని, కీర్తి చిన్నా, జ్యోతుల నాని, విప్పర్తి శ్రీను తదితరులు ఉన్నారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం ద్వారా శ్రమశక్తిని ఉపయోగించి రైతులు, మధ్యవర్తులు, పేషెంట్లకు భోజన సదుపాయం కల్పిస్తున్న సాయిప్రియ సేవాసమితి సేవలను కొనియాడుతూ, 139వ వారంలో కూడా స్వచ్చందంగా సేవలందించిన వారిని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు & జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు అభినందించారు.

Share this content:
Post Comment