పిఠాపురం, జనసేన అధినేత & ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు, ప్రజాసేవ స్ఫూర్తితో, నాటి జిల్లా జనసేన అధ్యక్షులు & నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్యులు కందుల దుర్గేష్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి, తూర్పుగోదావరిజిల్లా జనసేన కార్యదర్శి & సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు & జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గం జ్యోతుల శ్రీనివాసు నేటికి ఏర్పాటు చేస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు అన్నపానీయ సదుపాయం కల్పిస్తున్నారు. శనివారంనాడు ఉచిత అన్నపానీయ సదుపాయం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పిటల్స్ కి వచ్చిన ఔట్ పేషెంట్లకు కలిపి 600 మందికి వడ్డించబడింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లంకిషోర్, కీర్తి చిన్నా, జ్యోతుల నాని, విప్పర్తి శ్రీను, తదితరులు రైతులకు తమ సేవలను అందించగలిగారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రానికి శ్రమశక్తి ద్వారా రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, పేషెంట్లకు భోజన వసతి కల్పిస్తున్న మాతృసంస్థ అయిన సాయిప్రియ సేవాసమితి ద్వారా ఈ కార్యక్రమం చేపట్టబడింది. 137వ వారం కూడా స్వచ్ఛందంగా ఉచితంగా సేవలు అందిస్తున్న వారిని సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు & జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు చరవాణి ద్వారా అభినందించారు.

Share this content:
Post Comment