సిక్కోలు జనసేన క్రికెట్ టోర్నమెంట్ 21 కు హాజరైన శ్రీమతి కాంతిశ్రీ

శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ నాయకులు నిర్వహిస్తున్న సిక్కోలు జనసేన క్రికెట్ టోర్నమెంట్ 2021 క్రీడల్లో భాగంగా జరగబోయే మ్యాచ్ కి ఎచ్చెర్ల జనసేన పార్టీ టీంకి అభినందనలు తెలపడానికి ముఖ్యఅతిథిగా ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో మరింత ముందుకెళ్ళి రానున్న రోజుల్లో దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని దానికి జనసేన పార్టీ తరపు నుంచి అన్ని విధాలుగా క్రీడాకారులకు మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉదయ్, బాబాజీ, వాసు జనసైనికులు పాల్గొన్నారు.