లావేరు మండల ఉపాధి హామీ కూలీలతో శ్రీమతి కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలంలో శనివారం ఉపాధి హామీ పని చేస్తున్న వాళ్ళ దగ్గరకు నేరుగా చెరువు వద్దకు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి క్రాంతిశ్రీ వెళ్లి అక్కడ ఉన్న ప్రజలను పలకరించి వారితో జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి జనసేన పార్టీ గురించి పార్టీ సిద్ధాంతాలు ప్రాముఖ్యత మరియు పవన్ కళ్యాణ్ మనోభావాల గురించి అలాగే పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ” పాతిక కేజీల బియ్యం కాదు పాతిక సంవత్సరాల భవిష్యత్తు మీ పిల్లలకు ఇస్తాను అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి బాగా స్పందించి 2024లో పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు చెప్పారు అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును ప్రజలకు చూపించి మరియు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకులు దుర్గారావు, కోల రాజేష్, బాబాజీ, శంకర్, బాలినాయుడు, కోటి, ఎర్రయ్య, శ్రీను జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.