మంచి నీటి బోరు వేయించిన శ్రీమతి కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, అల్లివలస పంచాయతీ ఆరోగ్యంతో కోలుకున్న తర్వాత మంచి కార్యక్రమానికి నాంది పలుకుతూ నియోజకవర్గంలో అల్లివలస పంచాయతీలో త్రాగునీరు కోసం అల్లాడుతున్న ప్రజలకు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ ఆదివారం మంచి నీటి బోరును వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా.విశ్వక్షేణ్ అలాగే పంచాయతీ నాయకులు ఎర్రయ్య, కాశీ, రణస్థలం మండల నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, బలరాం, గొర్లె సుర్య, నియోజకవర్గ ఐటి విభాగం కోఆర్డినేటర్ రాంబాబు, దుర్గారావు, రాజారమేష్, బాబాజీ, సూర్య, నాయుడు, ఆనంద్, రామారావు, లక్ష్మణ్, ప్రసాద్, రాంప్రసాద్, తదితర జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.