రైతి నల్లోడు కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన శ్రీమతి లోకం మాధవి

నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామం మత్స్య కారి అయిన రైతి నల్లోడు తుఫాన్ తీవ్రత హెచ్చరిక నేపథ్యంలో అలలపై యాంకర్ సాయంతో నిలిపిన మరబోటును సముద్రపు తీరం ఒడ్డుకు చేర్చే క్రమంలో ప్రమాదవశాత్తు తెప్ప బోల్తా పడడంతో చనిపోయారు. ఈ సంఘటనను అధికారులు సముద్రంలో స్నానం చేయడానికి వెళ్లినట్టు చిత్రీకరించినట్టు గ్రామస్తులు వాపోతున్నారు. ఈ రైతి నల్లోడు కుటుంబాన్ని నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి పరామర్శించి ఆ కుటుంబానికి నాయ్యం జరిగే వరకూ పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా జనసేన పార్టీ మత్స్యకార ప్రధాన కార్యదర్శి కారి అప్పలరాజు, పూసపాటిరేగ మండల జనసేన నాయకులు గుడివాడ జామరాజు, బోర సతీష్, రమేష్, శేఖర్, నర్సింగ్ రావు, శరత్ మరియు తిప్పలవలస గ్రామ ప్రజలు పాల్గొన్నారు.