బురాడ పేట శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న శ్రీమతి లోకం మధవి

నెల్లిమర్ల, శ్రీరామనవమి పండుగ సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గంలోని చిన్న బురాడ పేట గ్రామంలో గ్రామ ప్రజల ఆహ్వానము మేరకు రామమందిరంలో జరుగుతున్న పూజకు నెల్లిమర్ల జనసేన నాయకురాలు లోకం మాధవి హాజరు కావడం జరిగింది. అక్కడ సుమారు 60 మంది రైతులు గత మూడేళ్లుగా చెరువుకి గండిపడటంతో ఎంతో నష్టపోయారు అని తెలుసుకొన్న మాధవి గత ఆదివారం వారిని కలసి వారి పొలాల గండి పూడ్పించడం జరిగింది. ఆ గండి పూడ్పించడానికి అయిన మొత్తం ఖర్చు గురువారం గ్రామ పెద్దల సమక్షంలో ఆ రైతాంగానికి అందజేశారు. అలాగే వారు గత 3 ఏళ్లుగా దాదాపు 300 ఎకరాలు పైచిలుకు ఉన్న భూమిలో నడవడానికి కూడా ఎంతో కష్టంగా ఉంటుందని వారు తింటున్న క్యారేజీలు కానీ, యూరియా బస్తాలు కానీ మోయటం ఎంతో కష్టతరంగా ఉందని అదే వర్షాకాలంలో అయితే వారి బాధ వర్ణనాతీతం అని అక్కడి ప్రజలు మాధవికి తెలపడంతో వారి రాస్తా నిర్మాణానికి తమ వంతు సహాయం అందచేస్తామని మాధవి భరోసా కల్పించారు.