తక్కెడ నరసింహారావుకు నివాళులర్పించిన శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి

నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల మండలంలోని కీసర గ్రామం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ తక్కెడ వెంకటేశ్వరరావు కుమారుడు తక్కెడ నరసింహారావు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తెప్పలి కోటేశ్వరరావు, తాడిబోయిన సూర్యతేజ, పురంశెట్టి నాగేంద్ర టీం పవన్ ఆర్మీ, కొమ్మవరపు స్వామి వివిధ గ్రామాల జనసైనికులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.