మార్కపుడి గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి చందర్లపాడు మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన మార్కపుడి గణేష్ అనే జనసైనికుడు అనారోగ్యంతో మరణిస్తే వారి ఇంటికి వెళ్ళి అతని కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అనంతరం చందర్లపాడు మండలం జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు పురంశెట్టి నాగేంద్ర తండ్రి సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమాదేవితో పాటు జనసైనికులు మరియు వీర మహిళలు కూడా పాల్గొనడం జరిగింది.