ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందునిచ్చిన శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, పవిత్రమైన ఈ రంజాన్ మాసాన్ని పునస్కరించుకొని శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి ముస్లిం సోదరులకు బుధవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషములకు పూతలపట్టు టౌన్ లోని “నురానీ” మసీదు నందు “ఇఫ్తార్” విందును ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ సి.యం కావాలని మరియు జనసేన పార్టీ ఉన్నత స్థాయికి చేరుకోవాలని మసీదులోని మత గురువులు “దువా” చేసి ఆశీర్వదించారు. విందు పూర్తి అయిన తరువాత కొంతమంది ముస్లిం సోదరులు రమాదేవితో మాట్లాడుతూ మాట తప్పం, మడం తిప్పం అని గొప్పలు చెప్పుకునే వై.సి.పి పార్టీ, ముస్లింలకు దులహన్ పథకం విషయంలో వెన్నుపోటు పొడిచారనీ, ముస్లింల సంక్షేమ పథకాలు వారికీ పూర్తిగా అందడం లేదని వాపోయారు. ప్రజలందరి భవిష్యత్ కోసం మేము జనసేన పార్టీకి చేయూతనిచ్చి మా వంతు కృషి చేస్తామని అన్నారు.