“నో మై కాన్స్టిట్యుఎన్సి”లో భాగంగా 14వ రోజు కొత్తపేటలో పర్యటించిన శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన “నో మై కాన్స్టిట్యుఎన్సిలో” కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేటలో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. డ్రైనేజీ కాలువలు, పారిశుధ్యం, అధిక ధరలు, టిడ్కో ఇళ్ల కోసం లక్షలు అప్పు చేసి కట్టినా కూడా ఇంతవరకు ఇళ్లు కేటాయించలేదు అని తెలియజేశారు. ప్రజల సమస్యలను మునిసిపల్ కమిషనర్ కి, జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేలా జనసేన పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని శ్రీమతి వినుత ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు భవాని శంకర్, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్, రేణిగుంట మండల అధ్యక్షుడు మునికుమార్, నాయకులు మణికంఠ, ప్రమోద్, సురేష్, నితీష్, రవి కుమార్, చందు మరియు జనసైనికులు పాల్గొన్నారు.