తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం: ప్రసిద్ది గాంచిన తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా పాల్గొని అమ్మ వారికి సారే సమర్పించి, దర్శనం చేసుకుని పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.