పేద వృద్ద కుటుంబంపై దాతృత్వం చాటిన శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం: తొట్టంబేడు మండలం, జ్ఞానమ్మ కండ్రిగ గ్రామంలో పేద వృద్ద కుటుంబంలో అవ్వ ఆదెమ్మ (90) శివైక్యం చెందారు. భౌతిక కాయానికి జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా నివాళులు అర్పించి, పరామర్శించి, ఎత్తుబడుల ఖర్చులకి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ పేద కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఇదివరకే ప్రతి నెలా నిత్యావసర వస్తువులు ఇంఛార్జి వినుత కోటా అందిస్తున్నారు.