నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలిగా శ్రీమతి దారం అనిత

మదనపల్లె, నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలుగా నియమితులైన శ్రీమతి దారం అనితకి మదనపల్లె జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీమతి దారం అనితని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకుడు శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ నా సోదరి సమానురాలైన శ్రీమతి దారం అనితకి నా సేన కోసం నా వంతు సాయం రాష్ట్ర కమిటీలో సభ్యత్వం కలిగించినందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ మదనపల్లె పట్టణ అధ్యక్షుడు జగదీష్ బాబు నాయిని మాట్లాడుతూ నా సేన కోసం నా వంతు సాయం అనే రాష్ట్రస్థాయి కమిటీలో నియమితమైన శ్రీమతి దారం అనితకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలు శ్రీమతి దారం అనిత, మదనపల్లి సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్, మదనపల్లి యువ నాయకులు శ్రీరామ హరిహరన్, పట్టణ అధ్యక్షుడు జగదీష్ బాబు నాయిని, జనసేన వీర మహిళలు మల్లికా, రూప, సుప్రజా జనసేన నాయకులు కొణిదల శంకర్ తుపాకుల, ధరణి ఆకుల, శంకర, అశ్వత్, వినయ్ కుమార్ రెడ్డి, శేఖర్, గంగాధర్, బహదూర్, యాసీన్, గణేష్, నవాజ్, హర్ష, సోను తదితరులు పాల్గొన్నారు.