ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న సీట్లను మాప్‌ అప్‌ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. రేపు(ఫిబ్రవరి 23) ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు వెబ్‌ అప్షన్లను నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఖాళీ సీట్ల వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచామని అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in ను పరిశీలించవచ్చునని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.