వేల్పులవీధి గౌరీపరమేశ్వరుల ఆలయాన్ని సందర్శించిన ముక్క శ్రీనివాస్

అనకాపల్లి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వర ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఉత్తరాంధ్ర జనసేన సీనియర్ నాయకులు ముక్క శ్రీనివాస్ రావు (వైజాగ్ గోల్డ్ మెన్) ఆలయాన్ని సందర్శించి, ఆలయ అభివృద్ధికి ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఆలయం మండపం ఏర్పాటు చేసేటప్పుడు కూడా తనవంతు సహాయం అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జనసేన పార్టీ వీరమహిళ దూడల పద్మ సీత రామలక్ష్మి, చవక్కుల చైతన్య, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.