టీ-టైం పాయింట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముమ్మారెడ్డి

కూకట్ పల్లి నియోజకవర్గంలోని జె ఎన్ టి యు నుండి హైటెక్ సిటీ రోడ్డు 3వ పేస్ (కె ఎస్ బేకర్) ఎదురుగా భవిరెడ్డి భూశంకర్ దంపతులు నూతనముగా ఏర్పాటుచేసిన టీ-టైం పాయింట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ విచ్చేసి టీ-టైం షాపుని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ.. యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యాపార రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అలాగే మరికొందరికి ఉపాధి కల్పించాలని, యువత యొక్క స్వయం ఉపాధి ద్వారా దేశాభివృద్ధి తోడ్పడుతుందని, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు యువత స్వయం ఉపాధికై రుణాల రూపేనా సహాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ కొల్లా శంకర్, కలిగినిడి ప్రసాద్, అంజి, పులగం సుబ్బు, షణ్ముఖ, సామన రాజు, వెంకటేశ్వరరావు, బాల కోటేశ్వరరావు, శేఖర్, అనిల్, చిన్నం దేవ సహాయం, సుబ్బారావు (సుబ్బు), తోట మురళి మరియు భూశంకర్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.