మురళి ఆచారి కుటుంబానికి కుటుంబానికి అండగా జనసేన
ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం, పెనగలూరు మండలం, ఇండ్లూరు గ్రామంలో దివ్యాంగులైన మురళి ఆచారి కుటుంబానికి రూపాయలు 10000/- అర్థికసాయం మరియు కుటుంబానికి రెండు నెలలకు సరిపడు నిత్యావసర సరుకులు అందజేసిన దాత జనసేన పార్టీ కువైట్ ముఖ్య సభ్యులు యర్రంశెట్టి హరిబాబు రాయల్ వారికి జనసేన పార్టీ కువైట్ సభ్యులు అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం జనసేన పార్టీ కువైట్ అధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ కువైట్ తరపున ముఖ్యసభ్యులుగా గంటా రమేష్ రాయల్ మరియు బల్లేపల్లి శ్రీను పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన వారికి జనసేన పార్టీ కువైట్ సభ్యులు అందరి తరుపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించి ఇంత విజయానికి దోహదపడిన జనసేన పార్టీ కంబాలకుంట జనసైనుకులకు, గోబ్బూరి హరికి జనసేన పార్టీ కువైట్ సభ్యులు అందరి తరుపున ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, ముఖరాం చాన్ మరియు తాతంశెట్టి నాగేంద్ర, చిట్వేల్ మండలం జనసేన పార్టీ యువ నాయకులు మాదాసు నరసింహ రాయల్ కి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వేకోడూరు నియోజకవర్గం జనసేన నాయకులకు మరియు జనసైనుకులు అందరికి పేరు పేరునా జనసేన పార్టీ కువైట్ సభ్యులు అందరి తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకొంటూన్నామని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-09-at-16.40.40-1024x461.jpeg)