మరోసారి ప్లాస్మా దానం..

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాను కోలుకున్నాక ప్లాస్మా ఇస్తానని ఆయన గతంలోనే ప్రకటించి, కోలుకున్న తర్వాత ఇప్పటికే ఒక సారి ప్లాస్మాదానం చేశారు. తాజాగా, ఆయన తన కుమారుడితో కలిసి రెండో సారి ప్లాస్మాదానం చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు.

‘మా రక్తంలో ప్రతిరక్షకాలు ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నాయని వైద్యులు గుర్తించారు. దీంతో నేను, మా కుమారుడు కిమ్స్‌లో రెండోసారి ప్లాస్మా దానం చేశాము. ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్లాస్మాదానం చేసినా ఏమీ కాదు.. సంతోషంగా ఉంది’ అని కీరవాణి ట్వీట్ చేశారు.

ఈ విషయాన్ని కాలభైరవ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. కోవిడ్‌ ఎఫెక్ట్‌ నుండి బయటపడ్డవారు యాంటీ బాడీస్‌ను చెక్‌ చేసుకుని వీలైతే మరోసారి ప్లాస్మాను దానం చేయాలంటూ కోరుతూ ప్లాస్మాను దానం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోను కూడా షేర్‌ చేశారు.